
మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి బహిరంగ సవాల్ విసిరారు బీజేపీ నేత విష్ణువర్ధన్రెడ్డి. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కనీసం గుడివాడలోనైనా పూర్తయ్యాయని చెప్పగలరా అని ప్రశ్నించారు విష్ణువర్ధన్ రెడ్డి. ప్రజా చార్జిషీట్పై చర్చకు సిద్దమా అంటూ ఛాలెంజ్ విసిరారు. రేపు (మే19) గన్నవరం బస్టాండ్ దగ్గర బహిరంగ చర్చకు సిద్దం కావాలన్నారు. 2024లో రాష్ట్రంలో బీజేపీ నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
గతంలో తిట్టారు.. ఇప్పుడు పొత్తుకోసం వెంపర్లాడుతున్నారు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బీజేపీ ఎక్కువ పార్లమెంట్ స్థానాలను గెలవబోతోందని బీజేపీ నేతవిష్ణువర్ధన్రెడ్డి జోస్యం చెప్పారు. గతంలో ప్రధాని మోడీని ఓడించాలని ప్రచారం చేసిన పార్టీలు ఇప్పుడు పొత్తు కోసం వెంపర్లాడుతున్నాయని ఆయన సెటైర్లు వేశారు. ఏపీలో తాగేందుకు నీరు లేకపోయినా ... మదద్యం మాత్రం ఏరులై పారుతుందన్నారు. రేపు( మే19) గన్నవరంలో బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం జరుగుతుతోంది. భవిష్యత్ కార్యాచరణ, పార్టీ వ్యవహరించాల్సిన తీరు సహా పలు అంశాలపై కీలక చర్చ జరుగుతుందని వెల్లడించారు బీజేపీ నేత విష్ణువర్ధన్రెడ్డి.