ఈటల గెలుపు మార్పుకు ఒక స్టార్టింగ్ పాయింట్

ఈటల గెలుపు మార్పుకు ఒక స్టార్టింగ్ పాయింట్

ఈటల గెలుపు బీజేపీ గెలుపు అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈటలను అణచివేయాలని చూసిన కేసీఆర్‎కు ప్రజలు మంచి గుణపాఠం చెప్పారని ఆయన అన్నారు. ప్రతిపక్షాలను తొక్కేయాలని మీరు అనుకుంటే.. ప్రజలు ధర్మాన్ని గెలిపించాలనుకున్నారని వివేక్ అన్నారు. ఈటల గెలుపుపై హుజురాబాద్ లో ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో ఆయన ఈటలతో కలిసి పాల్గొని మాట్లాడారు.

‘కేవలం హుజురాబాద్ ఓట్ల కోసమే కేసీఆర్ వందల కోట్లు ఖర్చుపెట్టారు. ఇదంతా గమనించిన ప్రజలు.. ఈటలను తమవాడు అనుకొని గెలిపించుకున్నారు. డబ్బులతో గెలవాలనుకునే రాజకీయ నాయకులంతా ఇది గమనించాలి. తెలగాణ రాజకీయాలలో మార్పులకు ఈటల గెలుపు ఒక స్టార్టింగ్ పాయింట్. కేసీఆర్‎ను మెడలు వంచేది బీజేపీ మాత్రమే. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉంది’ అని వివేక్ అన్నారు.