కాంట్రాక్టు ఉద్యోగాలుండవని చెప్పి కేసీఆర్ మోసం చేసిండు: వివేక్ వెంకటస్వామి

కాంట్రాక్టు ఉద్యోగాలుండవని చెప్పి కేసీఆర్ మోసం చేసిండు: వివేక్ వెంకటస్వామి

సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో కాంట్రాక్టు ఉద్యోగాలు ఉండవని చెప్పి మోసం చేశాడని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. మే 11వ తేదీ గురువారం మంచిర్యాల జిల్లాలో పర్యటించిన ఆయన తాండూరు మండలం కేంద్రంలో బీజేపీ జెండా ఆవిష్కరణ చేసి పార్టీ ఆఫీస్ ను ప్రారంభించారు..అనంతరం తాండూరు ఎమ్మార్వో ఆఫీసర్ ఎదుట ఐకేపీ వీఓఏలు చేస్తున్న సమ్మెకు మద్దతు ప్రకటించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వివేక్ వెంటస్వామి..కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల సమస్యలు మర్చిపోయారన్నారు. వారి ఇంట్లో నెలకు 25 లక్షల జీతం తీసుకుంటున్నారని ఆరోపించారు. రిటైర్ ఆయి వచ్చి నమస్తే పెట్టిన వాళ్లకు నెలకు రెండు, మూడు లక్షల జీతాలు ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని వివేక్ ప్రశ్నించారు.  ఐకేపీ వీఓఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వివేక్ డిమాండ్ చేశారు.