కేసీఆర్ ఐదు వేలు ఇచ్చి మీ ఓటు కొనే ప్రయత్నం చేస్తున్నాడు

కేసీఆర్ ఐదు వేలు ఇచ్చి మీ ఓటు కొనే ప్రయత్నం చేస్తున్నాడు

కేసీఆర్ ఐదు వేలు ఇచ్చి మీ ఓటు కొనే ప్రయత్నం చేస్తున్నాడు, మళ్లీ మళ్లీ మోసపోకండి అని బీజేపీ కోర్ కమిటీ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. 
మార్పు కావాలంటే బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఆయన అన్నారు. ‘ఇంటికొక ఉద్యోగం, డబల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి అధికారంలోకి వచ్చి నేటికి వాటి ఊసే లేదు. డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికీ అందలేదు. కానీ, వాళ్ళ సొంత కుటుంబాలకు మాత్రం వందల ఎకరాల ఫామ్ హౌజులు వచ్చాయి. 70 వేల కోట్లతో రాష్ట్రంలో ఉన్న నిరుపేదల అందరికీ ఇల్లు కట్టవచ్చు. 60 వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ నుంచి నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆ డబ్బుతో వేల ఎకరాల భూములు కొనుక్కున్నాడు. రాబందుల పాలనకు చరమగీతం పాడాలి. సాగర్ ఉపఎన్నికలో బీజేపీకి ఓటు వేసి రవి నాయక్‌ని గెలిపించండి’ అని వివేక్ అన్నారు.