హామీలు నెరవేర్చాలని కలెక్టరేట్ ముట్టడి

హామీలు నెరవేర్చాలని కలెక్టరేట్ ముట్టడి

జగిత్యాల టౌన్, వెలుగు : గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బీజేపీ లీడర్లు డిమాండ్ చేశారు. సోమవారం జగిత్యాల కలెక్టరేట్‌‌‌‌ను ముట్టడించి బైఠాయించారు. అనంతరం కలెక్టర్ యాస్మిన్ భాషకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ మోసపూరిత బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధిచెబుతారన్నారు. 

 ప్రభుత్వ పథకాల పంపిణీలో ఎమ్మెల్యేల జోక్యం పెరిగిందని విమర్శించారు. డబుల్​బెడ్రూం ఇండ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి, జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ రావు, తిరుపతిరెడ్డి, రాజేందర్ పాల్గొన్నారు.

ధర్నా కు తరలిన బీజేపీ శ్రేణులు  

కోరుట్ల: అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూం ఇండ్లు, రేషన్‌‌‌‌కార్డులు, నిరుద్యోగ భృతి, అన్ని కులాలకు రూ.లక్ష ఆర్థికసాయం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో చలో జగిత్యాలకు కోరుట్ల నుంచి బీజేపీ శ్రేణులు తరలివెళ్లారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సురభి నవీన్​కుమార్, నియోజకవర్గ కన్వీనర్ సుఖేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాల్లో కార్యకర్తలు తరలివెళ్లారు. వీరితోపాటు రమేశ్‌‌‌‌, తిరుమల వాసు, నర్సయ్య, మహేశ్‌‌‌‌, శ్రీనివాస్, రాజ మురళి, బీజేవైఎం లీడర్లు  ఉన్నారు.