మునుగోడుకు క్యూ కడుతున్న బీజేపీ నేతలు

మునుగోడుకు క్యూ కడుతున్న బీజేపీ నేతలు

మునుగోడు బైపోల్ ప్రచారానికి వన్ వీక్ మాత్రమే టైం ఉండటంతో నేతలంతా అక్కడే మకాం వేయాలని బీజేపీ ఆదేశించింది. ఈనెల 31 వరకు మునుగోడులోనే ఉండాలని సూచించింది. ఇప్పటికే చాలా మంది సీనియర్లతో పాటు ముఖ్యనేతలంతా ప్రచారంలో బీజీబీజీగా ఉన్నా...మిగిలిన లీడర్లంతా వెళ్లాలని కోరింది. దీంతో మునుగోడు బాట పట్టేందుకు బీజేపీ నేతలంతా సిద్ధమౌతున్నారు. ఇద్దరు ముగ్గురు నేతలు పార్టీ నుంచి వెళ్ళిపోవడంతో ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకొంటోంది. మునుగోడు ప్రచారం కోసం 40 మంది స్టార్ క్యాంపెనర్ లను ఏర్పాటు చేసుకున్నా.. వారితో సంబంధం లేకుండానే రంగంలోకి దిగుతోంది. ఈ వారం మొత్తం మునుగోడు నియోజకవర్గంలో నేతలంతా అక్కడే మకాం వేయాలని సూచించడంతో క్యూ కడుతున్నారు.

పార్టీ నుంచి ఓ ముగ్గురు నేతలు అధికార పార్టీలోకి వెళ్ళడంతో పాటు మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం పైన  కోర్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో పలు అంశాలపైన చర్చించిన కోర్ కమిటీ… పార్టీలో అసంతృప్తి, నేతల మధ్య సమన్వయం లేకపోయినా పార్టీ పరంగా ఇతర సమస్యలేమైనా ఉన్నా పరిష్కరించే బాధ్యతలను ఎంపీ లక్ష్మణ్ కు అప్పగించింది. మునుగోడు బైపోల్ పై కోర్ కమిటీ సీరియస్ గా చర్చించినట్లు తెలిసింది. పార్టీని వీడిన నేతల ఎఫెక్ట్ మునుగోడుపై పడకుండా పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యింది. అందరూ కలిసి కట్టుగా ప్రచారంలో దూసుకెళ్లి... బైపోల్ లో హ్యాట్రిక్ విక్టరీ కొట్టాలని బీజేపీ భావిస్తోంది.