
స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ రామాంతపూర్లో హోమియో జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మె ఎనిమిదో రోజుకి చేరింది. వారి సమ్మెకు బీజేపీ మాజీ ఎమ్మెల్యే, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, కార్పొరేటర్లు బండారి శ్రీవాణి, చేతనా హరీశ్ సంఘీభావం తెలిపారు.
వారికి మద్దతుగా సమ్మెలో కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమ్మె విషయం ప్రభుత్వానికి తెలిసినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ప్రభాకర్ ఆరోపించారు. స్టైఫండ్ పెంచుతామని రాతపూర్వకంగా హామీ ఇచ్చి ఎనిమిదేళ్లవుతున్నా పెంచకుండా వీరి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు.
పక్క రాష్ట్రాలతో పోల్చితే ఇక్కడ ఇచ్చే స్టైఫెండ్ చాలా తక్కువగా ఉందన్నారు. ప్రభుత్వం నిరసన కారులకు లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే బీజేపీ ఉద్యమాలు చేస్తుందని హెచ్చరించారు.