బీజేపీ మంత్రికి కరోనా పాజిటీవ్

బీజేపీ మంత్రికి కరోనా పాజిటీవ్

ఇండియన్ మాజీ క్రికెటర్,  ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ మంత్రి చేతన్ చౌహాన్ కు కరోనా వైరస్ సోకింది. వైరస్ లక్షణాలు గుర్తించిన చౌహాన్ టెస్ట్ లు చేయించుకుగా అందులో కరోనా పాజిటీవ్ అని తేలింది. దీంతో అత్యవసర చికిత్స కోసం లక్నోలోని సంజయ్ గాంధీ పీజీఐ ఆస్పత్రిలో చేరారు. వారి కుటుంబసభ్యులు పరీక్షలు చేయించుకోవాల్సి ఉండగా..ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నారు. కాగా చౌహాన్ కు కరోనా వైరస్ పాజిటీవ్ అని తేలడంతో .. భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా ట్వీట్ చేశాడు. చౌహాన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.