- బీజేపీ ఎమ్యెల్యే ధన్పాల్సూర్యనారాయణ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో వందేమాతరం గీతం ఆలపించకుండా బయటకు వెళ్లిన ఎంఐఎం సభ్యులపై డీజీపీ సుమోటోగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్యెల్యే ధన్పాల్సూర్యనారాయణ డిమాండ్ చేశారు. గవర్నర్ ప్రసంగంలో ఆరు గ్యారంటీల మాటే లేదన్నారు. అన్నీ అబద్ధాలు, తప్పుడు వివరాలే గవర్నర్తో చెప్పించారని విమర్శించారు. ‘‘రైతు రుణ మాఫీ 50 శాతమే చేశారు.
వరిపై బోనస్ కూడా ఒక్కపంటకే ఇస్తున్నారు. అలాగే, ఉద్యోగాలకు సంబంధించి ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారో చెప్పలేదు. ఆరోగ్యశ్రీకి నిధులు రావడం లేదు. రాజ్యాంగాన్ని అవమానించేలా వ్యవహరించిన ఎంఐఎం సభ్యుల చర్యలు దేశాన్నే అవమానించినట్టు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ఊరుకోం. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తం” అని అన్నారు.
