మాఘ మాసం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలం మల్లారెడ్డి పేటలోని శ్రీ వీరాంజనేయ స్వామి వారిని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు దర్శించుకున్నారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకులు కటకం మృత్యుంజయం, జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్యెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ.. సంస్కృతీ సంప్రదాయాలకు భారతదేశం నిలయమని ఆయన అన్నారు. ‘నేడు మన సంప్రదాయలు ప్రపంచానికి మార్గదర్శకాలుగా మారాయి. బ్లాస్టింగ్లతో పురాతన శిల్ప సంపదను కొల్లగొట్టకూడదు. ఒకవేళ ఎవరైనా ఈ దుశ్చర్యకు పాల్పడితే భగవంతుడు క్షమించడు. మారుతున్న కాలానికి అనుగుణంగా సంప్రదాయలు కాపాడుకోవాలి. ప్రజలను కుక్కలుగా చూస్తున్న పెద్ద మనుషులకు మాఘ మాసం సందర్భంగా దేవుడు వారికి మంచి బుద్ది, జ్ఞానం ప్రసాదించి.. సహనం కోల్పోకుండా, ప్రజలను గౌరవించే విధంగా బుద్ది ప్రసాదించాలని దేవుడిని కోరుకున్నాను’ అని ఆయన అన్నారు.
For More News..