తెలంగాణలో బీఆర్ఎస్ కథ ముగిసింది: బీజేపీ ఎంపీ లక్ష్మణ్

తెలంగాణలో బీఆర్ఎస్ కథ ముగిసింది: బీజేపీ ఎంపీ లక్ష్మణ్

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కథ ముగిసిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఇకపై రాష్ట్రంలో బీజేపీదే భవిష్యత్ అని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటై ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదన్నారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.

కుటుంబం కోసమే కాంగ్రెస్ పని చేస్తోందని విమర్శించారు. ఓట్ల కోసం బీసీల పట్ల కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తోందని, విభజన రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. రానున్న లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌‌‌‌కు బుద్ధి చెబుతారన్నారు. భారీ మెజార్టీతో మూడోసారి మోదీ ప్రధాని అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.