రేపు నర్సాపూర్ లో బహిరంగ సభ

రేపు నర్సాపూర్ లో బహిరంగ సభ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్ చార్జ్​లు, అసెంబ్లీ ప్రభారీలతో బీజేపీ స్టేట్​ చీఫ్​ సంజయ్ శనివారం భేటీ కానున్నారు. దీనికి పార్టీ రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇన్‌‌చార్జ్ సునీల్ బన్సల్, రాజకీయ వ్యవహరాల ఇన్‌‌చార్జ్ తరుణ్ చుగ్, సహ ఇన్‌‌చార్జ్‌‌ అరవింద్ మీనన్  హాజరవుతారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మునుగోడు బైపోల్, ప్రచారం వంటి అంశాలపై జాతీయ నేతలు ఈ భేటీలో దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 9న మెదక్ జిల్లా నర్సాపూర్‌‌‌‌లో జరిగే బహిరంగ సభకు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ తోపాటు తరుణ్ చుగ్, లక్ష్మణ్, సంజయ్ హాజరు కానున్నారు. కార్యక్రమంలో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్, పరకాల మాజీ ఎమ్మెల్యే భిక్షపతి బీజేపీలో చేరనున్నారు.