- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు
ఖమ్మం టౌన్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిది ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని, ఖమ్మంలో గడ్డపార రాజ్యం నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆరోపించారు. ఆదివారం ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో భూదాన్ బాధితులను ఆయన పరామర్శించి మాట్లాడారు. బాధితులందరికీ కూల్చిన చోటే ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వెలుగుమట్ల పక్కన జాతీయ రహదారి రావడం వల్ల భూమి విలువ పెరిగిందని, అధికార పార్టీకి సన్నిహితులైన వ్యాపారులకు ఆ భూములను కట్టబెట్టేందుకే ఇండ్లు కూల్చారని విమర్శించారు. బాధితులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వబోమని, న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
