ఇవాళ దుబాయ్ వేదికగా జరిగే పాక్-టీమిండియా మ్యాచ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఇండియా గెలుపు ఆకాంక్షిస్తూ అభిమానులు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. యూపీ కాన్ఫూర్ లో భారీ జెండాలు ప్రదర్శించారు. పలుప్రధాన నగరాల్లో సాయంత్రం మ్యాచ్ కోసం బిగ్ స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నారు. చిరకాల ప్రత్యర్థి పాక్ పై గెలిచి టీ20 వరల్డ్ కప్ లో సూపర్ ఆరంభాన్ని ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. జమ్మూకాశ్మీర్ లో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రవీంద్ర రైనా ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాకిస్థాన్ పై ఇండియా గెలవాలని కోరుతూ క్రికెట్ అభిమానుల సమక్షంలో భారీ యాగం చేపట్టారు.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను భారత్ ఓడిస్తుందని రవీంద్ర రైనా ఆశాభావం వ్యక్తం చేశారు.