ఏపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

ఏపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే 10మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఏపీలో ఈసారి టీడీపీ- జనసేన-బీజేపీ కలిసి ఎన్నికలకు వెళ్తున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా టీడీపీకి 144 అసెంబ్లీ స్థానాలు, 17 ఎంపీ స్థానాలు... జనసేనకు 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు..  బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు, 6 లోక్ సభ స్థానాలు కేటాయించారు. ఈ క్రమంలో ఏపీలో పోటీ చేసే ఎంపీ అభ్యర్థులను ఇప్పటికే బీజేపీ ప్రకటించింది. తాజాగా ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది.

బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల వివరాలు:

విశాఖ నార్త్    -   విష్ణుకుమార్ రాజు
అరకు వ్యాలీ -    రాజారావు
అనపర్తి          -    శివక్రిష్ణంరాజు
 కైకలూరు      -    కామినేని శ్రీనివాస్
ఎచ్చెర్ల           -  ఈశ్వరరావు
విజయవాడ వెస్ట్ - సుజనా చౌదరి
బద్వేల్          -   బొజ్జ రోశన్న
జమ్మలమడుగు  -   ఆదినారాయణరెడ్డి
ఆదోని            -    పార్ధసారధి
ధర్మవరం     -   వై సత్య కుమార్

 బీజేపీ ఎంపీ అభ్యర్థుల వివరాలు

అరకు         -    కొత్తపల్లి గీత
అనకాపల్లి   -    సీఎం రమేష్
రాజమహేంద్రవరం  - పురందేశ్వరి
నర్సాపురం  - భూపతిరాజు శ్రీనివాస వర్మ
తిరుపతి (ఎస్సీ)  -  వరప్రసాదరావు
రాజంపేట   -   కిరణ్ కుమార్ రెడ్డి