న్యూఢిల్లీ: గుజరాత్లో గత 25 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ 2022 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోరూ. 209 కోట్లకు పైగా ఖర్చు చేసిందని ఆ పార్టీ ఎన్నికల సంఘానికి ఖర్చుల వివరాలను సమర్పించింది. ఈ రిపోర్ట్ ను పోల్ ప్యానెల్ పబ్లిక్ డొమైన్లో ఉంచింది. అభ్యర్థుల ఎన్నికల ఖర్చు, ప్రచార ఇతరత్రాలకు రూ. 209 కోట్లు ఖర్చు చేసినట్లుగా వెల్లడించింది.
వీటిలో అభ్యర్థుల ఎన్నికల ఖర్చు నిమిత్తం రూ.41 కోట్లు కేటాయించగా, రూ. 15 కోట్లు ప్రయాణాలకు, రూ. 160 కోట్లు ప్రచారానికి వెచ్చించినట్లుగా ఈసీకి తెలిపింది. గత డిసెంబర్లో గుజరాత్లో భారీ మెజారిటీతో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది.
గుజరాత్లో మొత్తం 182 అసెంబ్లీ సీట్లున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 92 సీట్లు అవసరమవగా.. బీజేపీ 156 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 17, ఆమాద్మీ 5 సీట్లలో విజయం సాధించింది. ఇతరులకు 4 స్థానాలు వచ్చాయి. బీజేపీకి ఏకంగా 156 సీట్లు రావడంతో.. వార్ వన్సైడ్ అయింది.