ఒక్క కార్పొరేటర్‌ని కెలికెతే.. వందమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కెలుకుతం

ఒక్క కార్పొరేటర్‌ని కెలికెతే.. వందమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కెలుకుతం

TRS, MIM విముక్త హైదరాబాద్ కోసం కృషి చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో అత్యధిక సీట్లలో విజయం సాధించిన సందర్భంగా.. గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి ఆయన చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. వీరితో పాటు కొత్తగా ఎన్నికైన 48 మంది కార్పొరేటర్లు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత అమ్మవారి సమక్షంలో పార్టీ అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి.. బీజేపీ కార్పొరేటర్లతో ప్రమాణం చేయించారు. ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూనే… అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని నూతన కార్పొరేటర్లు ప్రమాణం చేశారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటామని బండి సంజయ్ ఎన్నికలకు ముందు అన్నారు. అమ్మవారి దయతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించామన్న ఆయన.. నూతన కార్పొరేటర్లతో కలిసి శుక్రవారం అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. భాగ్యలక్ష్మీ అమ్మవారి పేరు వల్లే హైదరాబాద్‌కు భాగ్యనగరమని పేరొచ్చిందని ఆయన అన్నారు.

‘భాగ్యనగరాన్ని అభివృద్ధి చేసే అవకాశం ప్రజలు బీజేపీకి ఇచ్చారు. పాతబస్తీ ఎందుకు అభివృద్ధి చెందలేదో ప్రజలు ఆలోచించాలి. పాతబస్తా బీజేపీ అడ్డా.. అభివృద్ది చేసి చూపుతాం. బీజేపీ ఏ మతానికి వ్యతిరేకం కాదు. తొందర తొందరగా జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించిన కేసీఆర్.. మరి మేయర్ ఎన్నిక ఎందుకు నిర్వహించడం లేదో చెప్పాలి. కార్పొరేటర్ల కొనుగోలుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. మా ఒక్క కార్పొరేటర్‌ను కెలికెతే.. మేం వంద మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కెలుకుతం. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ గుణపాఠం నేర్చుకోవాలి. బీజేపీ కార్పొరేటర్లతో కలిసి వరదసాయం కోసం పోరాటం చేస్తాం. కేసీఆర్ పొర్లుదండాలు పెట్టినా జైలుకెళ్లడం మాత్రం ఖాయం. సీఎం అనాలోచిత నిర్ణయాల వల్ల రిజిస్ట్రేషన్ వ్యవస్థ నాశనం అయింది.

For More News..

500 ఎకరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద గుడి

మీరు నీళ్లు ఎలా తాగుతున్నారు.. అలా తాగితే మాత్రం డేంజరే..