
న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై రాజ్ నాథ్ తో చర్చించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ చేస్తున్న కార్యక్రమాలను, ప్రజా సంగ్రామ యాత్ర వివరాలను కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో మరిన్ని సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా బండి సంజయ్ కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 14 నుంచి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతున్నట్లు రాజ్ నాథ్ సింగ్ కు వివరించారు బండి సంజయ్.
ఇవి కూడా చదవండి
ఎంజీఎంలో ఎలుకల దాడి మా నిర్లక్ష్యమే
మోడీని చంపేస్తాం.. ఎన్ఐఏకు బెదిరింపు మెయిల్..