టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలపై బైక్ ర్యాలీలు

టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలపై బైక్ ర్యాలీలు

10 మందితో కమిటీ
హైదరాబాద్, వెలుగు: ‘పల్లె గోస... బీజేపీ భరోసా’ పేరుతో 21 నుంచి తెలంగాణ వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలపై బైక్ ర్యాలీలు చేపట్టాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. బైక్ ర్యాలీలను సక్సెస్ చేయడం కోసం స్టేట్​ పార్టీ 10 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని నియమించింది. ఇందులో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డితో పాటు రాష్ట్ర బీజేపీ నేతలు కాసం వెంకటేశ్వర్లు, భరత్ గౌడ్, మురళీధర్ గౌడ్, మహిపాల్ రెడ్డి, ఇతర లీడర్లున్నారు. ఈ కమిటీ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీల సక్సెస్ కోసం ఎప్పటికప్పుడు ఆయా నియోజకవర్గ నేతలతో చర్చిస్తుంటుంది. పూర్తి స్థాయిలో సక్సెస్​ కోసం పని చేస్తుంది.