బెంగాల్‌, అస్సాం ప్రజలు మోడీ వైపే

బెంగాల్‌, అస్సాం ప్రజలు మోడీ వైపే

ఉదల్‌‌గుడ్డి: బెంగాల్‌‌లో అధికారాన్ని కైవసం చేసుకుంటామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోసం బలంగా కోరుకుంటున్నారని చెప్పారు. ప్రధాని మోడీ సభలకు వస్తున్న ప్రజలను బట్టి బెంగాల్‌‌లో బీజేపీ గెలుపు ఖాయమని స్పష్టమవుతోందన్నారు. ఎలక్షన్స్‌‌లో పక్కాగా 200 పైచిలుకు సీట్లు గెలిచి దీదీ కోటను బద్దలు కొడతామని ధీమా వ్యక్తం చేశారు. అస్సాంలో ఎలక్షన్ ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అస్సాంలో తాము శాంతిని నెలకొల్పామన్నారు. బెంగాల్‌‌తోపాటు అస్సాంకు మోడీ విజన్ చాలా అవసరమని, ప్రజలు ఆయన వైపే నమ్మకంతో చూస్తున్నారని పేర్కొన్నారు.