రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్..తారుమారైన అంచనాలు

రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్..తారుమారైన అంచనాలు

రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్తో పార్టీల అంచనాలు తలకిందులయ్యాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ తమకు బలం లేని దగ్గర కూడా గెలిచి నిలిచింది. సాధారణ ఎన్నికల్లాగే ఈసారి రాజ్యసభ ఎన్నికలు ఉత్కంఠను రేపాయి. మొత్తం 16 స్థానాలకు గానూ 8స్థానాలను బీజేపీ దక్కించుకోగా కాంగ్రెస్ -5, శివసేన, ఎన్సీపీ,ఇండిపెండెంట్ ఒక స్థానంలో విజయం సాధించాయి. ప్రధానంగా హర్యానా, మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేనకు గట్టి షాక్ ఇచ్చింది బీజేపీ. హర్యానాలో కాంగ్రెస్ తరుపున బరిలో నిలిచిన అజయ్ మాకెన్ ఓడిపోయారు. ఇక్కడ బీజేపీ ఒకస్థానంలో గెలిపొందగా..మరో స్థానాన్ని ఇండిపెండెంట్ అభ్యర్థి కైవసం చేసుకున్నాడు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తాము ఓటేసిన బ్యాలెట్లను బహిరంగంగా ప్రదర్శించారని బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. 

మహారాష్ట్రలో శివసేన్ సర్కార్ షాక్

మహారాష్ట్రలో  శివసేన కూటమి బీజేపీ గట్టి షాక్ ఇచ్చింది. ఈ రాష్ట్రంలో ఆరు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మూడు సీట్లను బీజేపీ గెలుచుకోగా మూడు అధికార కూటమికి దక్కాయి. ఇక్కడ ఆరవ స్థానం కోసం శివసేన బీజేపీ మధ్య గట్టి పోటీ నడిచింది. అయితే ఆ స్థానాన్ని అనూహ్యంగా కమలం పార్టీ కైవసం చేసుకుంది. బీజేపీ నుంచి పీయూష్ గోయల్, అనిల్ బోండే, ధనంజయ్ మాహాదిక్ గెలిపొందగా..మహా వికాస్ అగాఢీ కూటమి నుండి సంజయ్ రౌత్, ప్రపుల్ పటేల్,ఇమ్రాన్ ప్రతాప్ గర్హి గెలిపొందారు. 

 

రాజస్థాన్ లో కాంగ్రెస్..కర్ణాటకలో బీజేపీ

ఇక కర్ణాటకలో బీజేపీ తరుపున నిర్మల సీతారామన్, నటుడు జగ్గేష్, పారిశ్రామికవేత్త లెహర్ సింగ్ సిరోయ్ విజయం సాధించగా..కాంగ్రెస్ నుంచి జైరాం రమేష్ ఎన్నికయ్యారు. ఇక్కడ బలం లేకున్న బీజేపీ, జేడీఎస్ వేర్వేరు అభ్యర్థులను నిలపగా దానిని బీజేపీ క్యాష్ చేసుకుని విన్ అయింది. ఇక రాజస్థాన్ లో కాంగ్రెస్ మూడు స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేతలు,రణదీప్ సుర్జేవాలా, ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తివారి గెలిపొందగా..బీజేపీ నుంచి ఘనశ్యామ్ తివారీ విజయం సాధించారు. అయితే బీజేపీ మద్ధతుతో బరిలోకి దిగిన జీగ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర ఓడిపోయారు.