బీజేపీ ఐదో జాబితా విడుదల.. ఏడు సీట్లకు అభ్యర్థుల ప్రకటన

బీజేపీ ఐదో జాబితా విడుదల.. ఏడు సీట్లకు అభ్యర్థుల ప్రకటన
  • అర్ధరాత్రి వరకు ఖరారు కానీ మరో నాలుగు సీట్లు

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలో బీజేపీ ఇప్పటి వరకు 100 సీట్లకు అభ్యర్థులను  ప్రకటించగా, పొత్తులో భాగంగా జనసేనకు 8 సీట్లు కేటాయించింది. మిగిలిన11 సీట్లలో ఏడు నియోజకవర్గాల అభ్యర్థిత్వాలను గురువారం ఖరారు చేసింది. ప్రకటించిన అభ్యర్థులకు రాష్ట్ర పార్టీ తరఫున నేరుగా ఫోన్ చేసి సమాచారం అందించారు. ఇంకో నాలుగు సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. శుక్రవారం నామినేషన్లకు చివరి రోజు కావడంతో గురువారం అర్ధరాత్రి లేదా శుక్రవారం ఉదయమే బీజేపీ హైకమాండ్ మిగతా నాలుగు సీట్లను ప్రకటించనుంది. ఈ సీట్లతో పాటు ఇది వరకే ప్రకటించిన చాంద్రాయణగుట్ట, వనపర్తిలో రెండు చోట్ల అభ్యర్థులను మార్చనున్నారు. చాంద్రాయణగుట్టలో సత్యనారాయణ అనారోగ్య కారణాలతో పోటీకి దూరంగా ఉన్నారు. వనపర్తి అభ్యర్థి అశ్వత్ధామరెడ్డి కూడా పోటీకి నో చెప్పారు. వనపర్తి నుంచి అనుజ్ఞా రెడ్డికి టికెట్ ఇవ్వాలని బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తున్నది. చాంద్రాయణగుట్టకు మరొకరిని ప్రకటించాల్సి ఉంది.

ఐదో లిస్ట్​లో ప్రకటించిన ఆరుగురు అభ్యర్థులు

1. మల్కాజిగిరి – రామ్ చందర్ రావు
2. పెద్దపల్లి – దుగ్యాల ప్రదీప్ రావు
3. శేర్ లింగంపల్లి – రవికుమార్ యాదవ్
4. నాంపల్లి నుంచి– రాహుల్ చంద్ర
5. కంటోన్మెంట్ – కృష్ణ ప్రసాద్
6. సంగారెడ్డి – పులిమామిడి రాజు
7. మేడ్చల్​– విక్రమ్​రెడ్డి