మూడోసారి ఎంపీగా పోటీ.. హేమమాలిని ఆస్తులెంతో తెలుసా?

మూడోసారి ఎంపీగా పోటీ..  హేమమాలిని ఆస్తులెంతో తెలుసా?

ఉత్తరప్రదేశ్‌లోని మధుర నియోజకవర్గం నుంచి  మూడోసారి ఎంపీగా పోటీ చేస్తున్న హేమమాలిని తన ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన ఆస్తి రూ. 123 కోట్లుగా తెలిపారు.  రూ. 1.4 కోట్లు తన అప్పులుగా పేర్కొన్నారు.  నటనను తన వృత్తిగా తెలిపిన ఆమె...  అద్దె, వడ్డీ ఆదాయవనరులుగా వెల్లడించారు. తన భర్త ధర్మేంద్ర డియోల్ ఆస్తుల విలువ రూ.20 కోట్లు, అప్పులు రూ.6.4 కోట్లుగా పేర్కొన్నారు. 

హేమమాలని అఫిడవిట్ ప్రకారం ఇప్పటివరకు ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసు లేదు.  హేమ మాలిని వద్ద రూ. 13.5 లక్షల నగదు ఆమె భర్త ధర్మేంద్ర డియోల్ చేతిలో రూ.  43 లక్షల నగదు ఉన్నాయి.  మెర్సిడీస్ బెంజ్, అల్‌కాజార్, రేంజ్ రోవర్, మహీంద్రా బొలెరో, మారుతీ ఈఈసీఓ సహా రూ.61 లక్షల విలువైన వాహనాలు ఉన్నాయని వెల్లడించారు.   

హేమమాలిని 2012లో ఉదయపూర్‌లోని సర్ పదంపట్ సింఘానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. నామినేషన్ ధాఖలు చేసేముందు హేమ మాలిని యమునా నది ఒడ్డున ఉన్న విశ్రమ్ ఘాట్ వద్ద ప్రార్థనలు చేశారు.  యమునా నదిని శుభ్రం చేయడానికి కృషి చేస్తానని ప్రజలకు ఈ సందర్భంగా ఆమె  మాటిచ్చారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో హేమమాలిని మధుర నుంచి గెలుపొందారు. ఈ సారి అక్కడి నుంచి హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్నారు.