ప్రధాని మోడీ, బీజేపీపై అమెరికాలో రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. మోడీని దేవుడి పక్కన కూర్చోబెడితే ఈ విశ్వం ఎలా పనిచేస్తుందో ఆ దేవుడికే పాఠాలు చెబుతారంటూ సెటైర్ వేశారు. మోడీ మాటలకు ఆ దేవుడు కూడా కంగారుపడతాడని అన్నారు. అమెరికా సాన్ ఫ్రాన్సిస్కోలో మే 31న ప్రవాస భారతీయులతో ఏర్పాటు చేసిన ఈవెంట్లో మాట్లాడిన రాహుల్.. అంతా తమకే తెలుసన్న భావనతో కొందరు వ్యక్తులు భారత్ ను పాలిస్తున్నారని విమర్శించారు. అన్నీ తెలుసని అనుకోవడం ఓక వ్యాధిలాంటిదన్నారు.
దేశంలో నిరుద్యోగం ,ధరల పెరుగుదల పెరుగుతున్నా ప్రధాని మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భారత్ జోడోయాత్రను అడ్డుకునేందుకు మోడీ ప్రభుత్వ శథ విధాల ప్రయత్నించిందని ఆరోపించారు. రాహుల్ గాంధీ 10 రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు.
రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. విదేశాల్లో మోడీకి పెరుగుతోన్న ఆదరణను చూసి రాహుల్ జీర్ణించుకోలేకపోతున్నారని కౌంటర్ ఇచ్చారు బీజేపీ నేతలు. రాహుల్ విదేశాల్లో భారత పరువు తీస్తుండంటూ ధ్వజమెత్తారు.