పద్మారావునగర్,వెలుగు: సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్లో తెలంగాణ ఉమెన్స్ రగ్బీ లీగ్ 2026 సీజన్-2ను లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అథీనా, తెలంగాణ రగ్బీ అసోసియేషన్ బుధవారం ఘనంగా నిర్వహించాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 12 జట్లు పాల్గొనగా, బ్లాక్ ఆర్చర్స్ జట్టు విజేతగా నిలిచింది.
హైదరాబాద్ జట్టు ఫస్ట్ రన్నరప్గా, మేడ్చల్ సెకండ్ రన్నరప్గా నిలిచాయి. ముఖ్య అతిథిగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ డాక్టర్ మహేంద్ర రెడ్డి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.
