సదాశివపేట, వెలుగు: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కొల్కూర్ గ్రామంలో తమపై చేతబడి చేస్తున్నారని ఆరోపిస్తూ శనివారం దంపతులను చెట్టుకు కట్టేసి కొట్టారు. సీఐ నవీన్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ముత్తంగి యాదయ్య, భార్య శ్యామల చేతబడి చేస్తున్నారని ఆరోపణలతో గ్రామపంచాయతీ వద్ద వారిని గ్రామస్తులు చెట్టుకు కట్టేసి దాడి చేశారని తెలిపారు. విషయం తెలుసుకుని గాయాలపాలైన ఇద్దరిని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి, చికిత్స కోసం ఆస్పత్రికి తరలించామన్నారు.
గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా, మూఢనమ్మకాల పేరుతో అమాయకులైన వారిపై దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్ డిమాండ్ చేశారు.