
హైదరాబాద్: హైదరాబాద్లో భారీ పేలుళ్లకు పన్నిన కుట్రను తెలంగాణ ఇంటలిజెన్స్ భగ్నం చేసింది. ఏపీతెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టి.. హైదరాబాద్లో పేలుళ్లకు ప్లాన్ చేసిన ఇద్దరు వ్యక్తులను ఆదివారం (మే 18) అరెస్ట్ చేశారు. విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్కు చెందిన సమీర్ను అదుపులోకి తీసుకున్నారు. విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసిన సిరాజ్, సమీర్ కలిసి డమ్మీ బ్లాస్ట్కు ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ పేలుళ్ల గురించి సౌదీ అరేబియా నుంచి సిరాజ్, సమీర్కు ఐసిస్ మాడ్యుల్ ఆదేశాలిచ్చింది. తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్తో పాటు ఏపీ ఇంటెలిజెన్స్ జాయింట్ ఆపరేషన్ చేపట్టి ఈ కుట్రను భగ్నం చేశారు. సరిహద్దుల్లో పాకిస్థాన్తో ఉద్రిక్తతల వేళ దాదాపు కోటి మంది జనాభా నివసించే హైదరాబాద్లో పేలుళ్లకు కుట్ర పన్నడం సంచనంగా మారింది. ఇంటలిజెన్స్ అధికారుల అప్రమత్తత వల్ల పెను ప్రమాదం తప్పింది.
ALSO READ | హైదరాబాద్ ఓల్డ్ సిటీలో భారీ అగ్ని ప్రమాదం.. చార్మినార్ వెళ్లే ప్రధాన రహదారులు మూసివేత