రైతు బంధు దోపిడీపై విచారణ జరపాలి : దండి వెంకటి

రైతు బంధు దోపిడీపై విచారణ జరపాలి : దండి వెంకటి

నిజామాబాద్​అర్బన్, వెలుగు: బీఆర్ఎస్ ​ప్రభుత్వ హయాంలో అమలు చేసిన రైతుబంధు పథకంపై పూర్తిస్తాయి విచారణ జరిపించాలని బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్​ దండి వెంకటి డిమాండ్​ చేశారు. ఆదివారం సిటీలోని పార్టీ ఆఫీస్​లో విలేకరుల సమావేశంలో సమావేశంలో మాట్లాడారు.

రైతుబంధు ముసుగులో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్​కు చెందిన లీడర్లు, చివరకు ప్రభుత్వ అధికారులు సైతం విచ్చలవిడిగా దోచుకున్నారని ఆరోపించారు. కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్​ప్రభుత్వం రైతుబంధు పథకంతో పాటు లబ్ధిదారుల ఎంపికపై సమగ్ర విచారణ జరపాలని, ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు.