
వికారాబాద్, వెలుగు: రాష్ట్రస్థాయి అంధుల ఆశ్రమ పాఠశాలలో 2025–-26 విద్యా సంవత్సరానికి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు.
6 నుంచి 14 ఏళ్ల వయస్సు, 40 శాతం అంధత్వం ఉన్న విద్యార్థులు అర్హులన్నారు. విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం, దుస్తులు అందిస్తామని, మరిన్ని వివరాలకు మహబూబ్నగర్ పిల్లలమర్రి రోడ్డులోని పాఠశాలను లేదా 96182 43794 నంబర్ను సంప్రదించాలని సూచించారు.