ఏకశిలా వాకర్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

ఏకశిలా వాకర్స్  ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

హనుమకొండ సిటీ, వెలుగు: తలసేమియా వ్యాధిగ్రస్తుల సహాయార్థం ఏకశిలా పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సమక్షంలో క్యాంప్​ ఏర్పాటు చేయగా, దాదాపు 30 మంది వాకర్లు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వంగా రాజిరెడ్డి మాట్లాడుతూ అసోసియేన్ ఆధ్వర్యంలో పార్కులో ప్రతి ఏడాది రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

 కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ గవర్నర్ కూరాకుల భారతి, పూర్వ గవర్నర్ ఎల్లా గౌడ్, గౌరవ అధ్యక్షుడు దశరథ రామిరెడ్డి, సెక్రటరీ సోమయ్య, రెడ్ క్రాస్ సొసైటీ ఈసీ మెంబర్ వేణుగోపాల్, వాకర్స్ ప్రతినిధులు బొద్దిరెడ్డి రాజిరెడ్డి, వీరస్వామి, కుమారస్వామి, యాదగిరి, రమణ రెడ్డి, తిరుపతి, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.