మహబూబాబాద్లో ఘనంగా బొడ్రాయి వార్షికోత్సవం

మహబూబాబాద్లో ఘనంగా బొడ్రాయి వార్షికోత్సవం

మహబూబాబాద్​ అర్బన్​, వెలుగు:  పట్టణంలో బొడ్రాయి వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం గ్రామ, కుల దేవతల వద్ద బోనాలు చెల్లించారు. మూడు రోజుల క్రితం  ప్రారంభమైన  వార్షికోత్సవాలు  ఆదివారంతోముగిశాయి. ముందుగా హోమం, ప్రత్యేక పూజలు బొడ్రాయి వద్ద నిర్వహించారు.  

ఈ కార్యక్రమానికి  ముఖ్య​అతిథిగా ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, మున్సిపల్​ చైర్మన్​  డాక్టర్​ పాల్వాయి రాంమోహన్ రెడ్డి,  మాజీ ఎమ్మెల్యే శంకర్​నాయక్​, రాజకీయ నాయకులు పర్కాల శ్రీనివాస్ రెడ్డి, ఎడ్ల వేణుమాధవ్​, ఘనపురపు అంజయ్య, మాలె నాగేశ్వర్ రావు, బొడ్డుపెళ్లి ఉపేంద్రం, ఎడ్ల రమేశ్​, ఆకుల హరిప్రసాద్ తదితరులు ఉన్నారు.