
మేడిపల్లి, వెలుగు: బోడుప్పల్ శ్రీశ్రీశ్రీ బంగారు మైసమ్మ బోనాల జాతర ఆగస్టు 3న నిర్వహించాలని గ్రామ పెద్దలు తీర్మానం చేశారు. ఈ మేరకు ఆదివారం (జూన్ 29) ఆలయంలో సమావేశం నిర్వహించారు. బోనాలను రెండేళ్లకోసారి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు.
4న బలిగంప అనంతరం భవిష్యవాణి ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి తోటకూర వజ్రేశ్యాదవ్, నగర అధ్యక్షుడు, కార్పొరేటర్ పోగుల నర్సింహా రెడ్డి, మాజీ మేయర్ తోటకూర అజయ్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
బోనాలపై ‘చిలకలగూడ’ ఆలయ హక్కుదారుల మీటింగ్
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ లోని చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయ హక్కుదారుల సర్వసభ్య సమావేశం ఆదివారం (జూన్ 29) ఆలయ ఆవరణలో నిర్వహించారు. ఆషాఢ బోనాల నేపథ్యంలో భక్తులకు సౌకర్యాలు తదితర అంశాలపై చర్చించి, పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఏటా ఆలయ హక్కుదారులు అమ్మవారికి తొలి బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది.
అలాగే బోనాల ఉత్సవాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావుగౌడ్ ను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం సీతాఫల్మండి ప్రెసిడెంట్ గరికపోగుల చంద్రశేఖర్ వారిని సత్కరించారు. నాయకులు పల్లె రవికుమార్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.