వాతావరణ పరిస్థితుల వల్లే యాసంగిలో ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఐకి బాయిల్డ్‌‌‌‌‌‌‌‌ రైస్‌‌‌‌‌‌‌‌

వాతావరణ పరిస్థితుల వల్లే యాసంగిలో ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఐకి బాయిల్డ్‌‌‌‌‌‌‌‌ రైస్‌‌‌‌‌‌‌‌
  • సివిల్‌‌‌‌‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌‌‌‌‌ చైర్మన్ మారెడ్డి

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక వాతావరణ పరిస్థితుల కారణంగానే యాసంగిలో బాయిల్డ్ రైస్‌‌‌‌‌‌‌‌ను ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఐకి ఇస్తున్నామని సివిల్‌‌‌‌‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌‌‌‌‌ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ప్రెస్‌‌‌‌‌‌‌‌నోట్‌‌‌‌‌‌‌‌ రిలీజ్ చేశారు. యాసంగిలో వడ్లను రా రైస్‌‌‌‌‌‌‌‌గా మారిస్తే 30% నుంచి 40% వరకు నూకలు వస్తాయని, 25 శాతానికి మించి నూకలు ఉంటే ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఐ అనుమతించదని తెలిపారు. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడాలని, సమస్యను ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని మారెడ్డి కోరారు.