ప్రియాంక చోప్రా(Priyanka Chopra) ఇప్పుడు హాలీవుడ్లో పుల్ బిజీ అయింది. హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్( Nick Jonas)తో పెళ్లైన తర్వాత భారత్ వీడి లాస్ఏంజిల్స్కి ఆమె షిప్ట్ అయింది. ప్రస్తుతం భర్త నిక్, కూతురు మాల్టీ మేరీ చోప్రా జోనాస్తో కలిసి అక్కడే ఉంటోంది. అయితే ప్రియాంక తిరిగి ఇండియాకు వస్తుందని చాలా భావించారు. కానీ ఆమె ఇక లాస్ఏంజిల్స్లోనే శాశ్వతంగా నివాసం ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
అందుకే ఇండియాలోని తన ఆస్తులన్నింటిని వరుసబెట్టి అమ్ముతోంది. ఆ మధ్య లోఖండ్వాలాలోని ఒక కమర్షియల్ ప్రాపర్టీని రూ.7 కోట్లకు అమ్మేసింది. తాజాగా ముంబైలోని అంధేరి శివారులో ఉన్న రెండు పెంట్హౌస్లను ప్రముఖ నిర్మాత, దర్శకుడు అభిషేక్ చౌబేకి విక్రయించిందంట.
అందుకు ప్రతిఫలంగా రూ.6 కోట్లు తీసుకుందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఓషివారాలోని ఓ పెంట్హౌస్ను రూ.2.25 కోట్లకు, రెండో పెంట్హౌస్ను రూ.3.75 కోట్లకు విక్రయించారు.ఈ రెండు ఆస్తుల విక్రయానికి గానూ సుమారు 36 లక్షల రూపాయల స్టాంపు డ్యూటీ చెల్లించింది ప్రియాంక. అక్టోబర్ 23, 25 తేదీల్లో ఈ లావాదేవీలు జరిగినట్లు సమాచారం.
ప్రియాంక బాలీవుడ్ మూవీలో కనిపించి సుమారు మూడేళ్లు గడుస్తోంది. ఆమె చివరిగా 2021లో ది వైట్ టైగర్ అనే హిందీ సినిమాలో నటించింది. ప్రియాంక చోప్రా ప్రస్తుతం పలు ఇంగ్లిష్ సీరియల్స్, మూవీస్ , సిరీసుల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంటోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ సూపర్ హిట్గా నిలిచింది.