మధుర మీనాక్షి ఆలయానికి బాంబు బెదిరింపు

మధుర మీనాక్షి ఆలయానికి బాంబు బెదిరింపు

తమిళనాడు మధురైలోని ప్రసిద్ధ మీనాక్షి అమ్మవారి ఆలయానికి బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గుడి వద్ద భారీ భద్రత మోహరించారు. మీనాక్షి అమ్మవారి ఆలయం చుట్టూ దాదాపు 400 మంది పోలీసుల్ని పెట్టారు. బాంబ్ స్క్వాడ్ కూడా అక్కడికి చేరుకుని చెకింగ్ చేస్తోంది. ఆలయం లోపలా, బయటా అంతా జల్లెడ పడుతున్నారు పోలీసులు.

బుధవారం రాత్రి మధురై పోలీస్ కమిషనర్‌కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఓ మెయిల్ వచ్చింది. మదుర మీనాక్షి అమ్మవారి ఆలయంలో బాంబు దాడి చేస్తామంటూ అందులో హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ మెయిల్ పంపినదెవరన్నదానిపై సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.