గండిపేట, వెలుగు: శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన మూడు విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. కేరళలోని కస్తూర్, ఫ్రాంక్ఫర్ట్, లండన్ నుంచి ఫ్లైట్లు వస్తుండగా వార్నింగ్ మెయిల్స్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఎయిర్పోర్టులో సేఫ్ ల్యాండింగ్ చేసి ప్రయాణికులను దింపి బాంబు స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించారు. బాంబు లేదని అధికారులు నిర్ధారించారు.
