ముంబై : మహారాష్ట్ర సచివాలయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో సమాచారం అందుకున్న బాంబు నిర్వీర్య దళం వెంటనే అక్కడికి చేరుకుంది. మహారాష్ట్ర విపత్తు నిర్వహణ కంట్రోల్ రూమ్ కు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి, సచివాలయం ప్రాంగణంలో బాంబును అమర్చినట్లు చెప్పినట్లు తెలుస్తోంది.
మహారాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖకు చెందిన కంట్రోల్ రూమ్కు ఓ వ్యక్తి ఫోన్ చేసి, సచివాలయం ప్రాంగణంలో బాంబును అమర్చినట్లు చెప్పాడని సచివాలయానికి చెందిన ఓ సబ్బంది చెప్పాడని స్థానికులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు బాంబును గుర్తించి, నిర్వీర్యం చేయగలిగే స్క్వాడ్ను పంపించారట. అయితే ప్రాథమికంగా ఈ ఫోన్ కాల్ బూటకపు కాల్ అని తెలుస్తోందని ముంబై పోలీసులు తెలిపారు. తదుపరి దర్యాప్తు కొనసాగిస్తామన్న పోలీసులు.. మంత్రాలయ భవనం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు.