వాటర్బోర్డు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి : పీసీసీ అధ్యక్షుడికి జేఏసీ నేతల వినతి

వాటర్బోర్డు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి : పీసీసీ అధ్యక్షుడికి జేఏసీ నేతల వినతి

బషీర్​బాగ్, వెలుగు: వాటర్​బోర్డులో పెండింగ్​లో ఉన్న ఉద్యోగ, కార్మిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జేఏసీ నాయకులు సోమవారం పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్​ను కలిశారు. జలమండలి పరిధి పెరగడం వల్ల ఉద్యోగుల బదిలీల్లో నెలకొన్న ఆందోళనలను వివరించారు.

దీనిపై సానుకూలంగా స్పందించిన మహేశ్ కుమార్ గౌడ్ వెంటనే జలమండలి ఎండీతో ఫోన్​లో మాట్లాడారు. మహిళా ఉద్యోగులు,  రిటైర్మెంట్​కు దగ్గరగా ఉన్నవారి బదిలీల్లో ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.