కడుపునొప్పని పోతే ప్రాణం పోయింది

కడుపునొప్పని పోతే ప్రాణం పోయింది

 భీమదేవరపల్లి, వెలుగు: కడుపు నొప్పితో హాస్పిటల్‌‌కు పోతే ఓ మహిళ ప్రాణం పోయింది. ఆగ్రహించిన మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు.  బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం..  హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరుకు చెందిన బొమ్మిశెట్టి సుమలత(29)కు గురువారం కడుపునొప్పి రావడంతో భర్త రమేశ్​ హనుమకొండలోని ఓ ప్రైవేట్​హాస్పిటల్‌‌కు తీసుకెళ్లాడు. పరీక్షించిన డాక్టర్లు ఆమెకు శుక్రవారం ఆపరేషన్ చేశారు.

ఆదివారం సుమలత ఆరోగ్యం క్షీణించిందని, ట్రీట్‌‌మెంట్​అందిస్తున్నామన్న డాక్టర్లు.. సాయంత్రం 4గంటలకు చనిపోయిందని చెప్పారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. మృతురాలి భర్త రమేశ్​మాట్లాడుతూ డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తన భార్య ప్రాణం పోయిందని ఆరోపించారు. కడుపులో సమస్య ఉంటే ఆపరేషన్ చేసిన డాక్టర్లు కండ్లకు కాటన్ ఎందుకు పెట్టారో అర్థం కావడం లేదన్నారు. సుమలత ఏ సమస్యతో చనిపోయిందో కూడా తెలియడం లేదని వాపోయారు. సుమలత మృతిపై విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు వచ్చి బాధిత 
కుటుంబ సభ్యులకు నచ్చజెప్పారు.