
హైదరాబాద్ లో బోనాల జాతరకు వేళాయైంది. నేటి నుంచి జూలై 24 వరకు సిటీ శిగాలు ఊగనుంది. గురువారం గోల్కొండ కోటలో జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పణతో బోనాలు ఉత్సవాలు ప్రారంభకానున్నాయి. లంగర్హౌస్లో గురువారం తొట్టెల ఊరేగింపు, కోటలో బోనాల సమర్పణ కార్యక్రమం ఉంటుంది. దీని కోసం అమ్మవారి ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. బుధవారం అమావాస్య సందర్భంగా కోటలో వందల సంఖ్యలో తరలివచ్చిన భక్తులు మెట్లకు బొట్లు పెట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు.