
- మంత్రి కొండా సురేఖ ప్రకటన
హైదరాబాద్, వెలుగు: వరంగల్ భద్రకాళి అమ్మవారికి బోనాలు నిర్వహించేందుకు గతంలో తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. కొంతమంది నుంచి వస్తున్న అభ్యంతరాలతోపాటు పలు మాధ్యమాల్లో తప్పుడు వార్తలు ప్రచురితమైనందున కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించామని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.స్థానిక రాజకీయ విభేదాలను కొంతమంది అమ్మవారికి ముడిపెట్టి ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉందని, అసాంఘిక శక్తులను ప్రేరేపించవచ్చని చెప్పారు.