అధికారం ఎప్పటికీ బీఆర్ఎస్ కే ఉండదు: బూర నర్సయ్య గౌడ్

 అధికారం ఎప్పటికీ బీఆర్ఎస్ కే ఉండదు: బూర నర్సయ్య గౌడ్

హైదరాబాద్, వెలుగు: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తదో లేదోనని కేటీఆర్ భయపడుతున్నారని బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఆ పార్టీ అభద్రతా భావంతో ఉన్నదని అందుకే రాత్రికి రాత్రి జీవోలు ఇస్తూ భూములు కబ్జా చేస్తోందని ఆరోపించారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారం ఎప్పటికీ బీఆర్ఎస్ కే ఉండదని..ఈ విషయాన్ని కేటీఆర్ గుర్తు పెట్టుకోవాలని బూర నర్సయ్య తెలిపారు.

ప్రజలు ఓట్లేస్తేనే హీరోలు.. లేదంటే ఎవ్వరైనా జీరోలేనని చెప్పారు. తెలంగాణ ప్రజల సొమ్ముతో ఔరంగాబాద్ బీఆర్ఎస్ సభకు కేసీఆర్ భారీగా యాడ్స్ ఇచ్చారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర సొమ్మును సొంత అవసరాలకు ఖర్చు చేసే అధికారం కేసీఆర్ కు ఎక్కడిదని నిలదీశారు. బీఆర్ఎస్ నిర్వహించేది ఆత్మీయ సమ్మేళనాలు కాదని.. ఆత్మ వంచన సభలని ఎద్దేవా చేశారు.