బాలుడి అవయవ దానం

బాలుడి అవయవ దానం

గండీడ్, వెలుగు: ఇతరులలో తమ కొడుకుని చూసుకోవచ్చని భావించిన తల్లిదండ్రులు బ్రెయిన్​డెడ్  అయిన బాలుడి అవయవాలు దానం చేశారు. వివరాల్లోకెళితే.. మహమ్మదాబాద్  మండలం మంగంపేట్  తండాకు చెందిన హన్మంతు రాథోడ్  పోలీస్ కానిస్టేబుల్. ఉద్యోగరీత్యా కుటుంబంతో శంషాబాద్ లో నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు అర్జున్​ రాథోడ్(12) ఆరో తరగతి పూర్తి చేశాడు. 

ఈ నెల 1న నీళ్ల కోసం స్కూటీపై వెళ్లగా, ట్రాక్టరు ఢీకొట్టింది. దీంతో అతడికి శంషాబాద్​లోని ఆసుపత్రిలో చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం కేర్  ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యులు పరీక్షించి బ్రెయిన్​డెడ్  అయినట్లు నిర్ధారించారు. తమ కుమారుడు లేడన్న బాధను దిగమింగి, కొడుకు అవయవాలను దానం చేసేందుకు ముందుకువచ్చారు. అర్జున్​ అవయవాలను సేకరించి అవసరమైన వారికి అందజేశారు.