జీడిమెట్ల, వెలుగు: మల్లారెడ్డి ఆస్పత్రిలో బాలుడు కిడ్నాప్ అయిన ఘటన సూరారం పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. గాజుల రామారం ఓక్షితా ఎన్క్లేవ్లో ఉండే సాఫ్ట్వేర్ఎంప్లాయ్ బొల్లా రాజశేఖర్రెడ్డి (36), తన భార్య సుజాతకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో కొడుకు ఇషాన్రెడ్డి(4)తో కలిసి గురువారం సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి వెళ్లారు. చెకప్కోసం డాక్టర్ వద్దకు భార్య వెళ్లగా.. రాజశేఖర్ బయట కూర్చోగా.. కొడుకు అక్కడే కొందరి పిల్లలతో ఆడుకుంటున్నాడు.
రాజశేఖర్వద్దకు ఓ మహిళ వచ్చి బాబును తాను చూసుకుంటానని ఫోన్ ఇచ్చి వెళ్లమని చెప్పింది. దీంతో కొడుకుకు ఫోన్ ఇచ్చి అతడు భార్య వద్దకు వెళ్లాడు. ఐదు నిమిషాల్లోనే తిరిగి వచ్చి చూసే సరికి కొడుకు, ఆ మహిళా కన్పించలేదు. దీంతో ఆస్పత్రిలో వెతికినా ప్రయోజనం లేకపోగా సూరారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడికి ఇచ్చిన ఫోన్ఆధారంగా ట్రేస్చేసిన పోలీసులు షాపూర్నగర్లో ఉన్నట్టు ఆచూకీ దొరికింది. పోలీసులు వెతుకుతున్నట్టు గమనించిన ఆ మహిళ షాపూర్నగర్లో బాబును వదిలి పారిపోయింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.