షర్మిల వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ ఆందోళన

షర్మిల వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ ఆందోళన

తన భర్తపై వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని.. ఎమ్మెల్యే శంకర్ నాయక్ భార్య సీతామహాలక్ష్మీ ఆందోళనకు దిగారు. షర్మిల బస చేసిన క్యాంపు ముందు నిరసన చేపట్టారు. ఈ నిరసనలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. మహబూబాబాద్‭లో షర్మిల పాదయాత్ర చేయడానికి వీల్లేదంటూ ఆందోళన చేశారు. వైఎస్ఆర్టీపీకి చెందిన ఫ్లెక్సీలను దగ్ధం చేశారు. షర్మిల తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని.. శంకర్ నాయక్‭కు క్షమాపణ చెప్పే వరకు ఆందోళన కొనసాగిస్తామని బీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతలు వెంటనే ఆందోళన విరమించాలని పోలీసులు సూచించారు. అంతకుముందు..  నెళ్లికుదురు మండల కేంద్రంలో వైఎస్ షర్మిల శంకర్‌నాయక్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.  శంకర్ నాయక్ సైగ చెయ్యి.. ఎవడోస్తాడో  చూస్తా.. అంటూ సవాల్ విసిరారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు చేస్తున్న మోసాలను ఎత్తి చూపిస్తుంటే భయంగా ఉందా అంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.