మధిర, వెలుగు: కాంగ్రెస్ ఎన్నికల హామీలను అటకెక్కించిందని బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్ , సీపీఎం రాష్ర్ట నాయకులు పోతినేని సుదర్శన్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జితేందర్రెడ్డి అన్నారు. గురువారం మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లిలో 5, 6, 7 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ హయాంలోనే అభివృద్ది జరిగిందన్నారు.
కేసీఆర్ కాకతీయుల నాటి చెరువులను పూడిక తీయించి నీటి నిల్వలను పెంచి ప్రజలకు సాగు, తాగునీరు అందించారని తెలిపారు. రైతుబంధును ప్రవేశపెట్టి రైతులకు క్రమం తప్పకుండా సాయం అందించిన ఘనత కేసీఆర్దే అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాల్ రావు. బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ కూటమి నాయకులు పాల్గొన్నారు.
