- తర్వాతి వరుసలో దాసోజు శ్రవణ్
- దానంకు దీటుగా బీసీ నేతను పోటీకి దింపాలని బీఆర్ఎస్ నిర్ణయం
- లోక్సభ బరిలో దిగేందుకు ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ విముఖత
- గులాబీ బాస్ కేసీఆర్ కు ఫోన్చేసి చెప్పినట్లు సమాచారం
సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు బీఆర్ఎస్ హైకమాండ్మల్లగుల్లాలు పడుతోంది. నిన్నటి దాకా అంతా ఎమ్మెల్యే పద్మారావుగౌడ్పోటీ చేస్తారని భావించగా, అందుకు ఆయన సిద్ధంగా లేరని తెలుస్తోంది. గురువారం నేరుగా పార్టీ చీఫ్కేసీఆర్ కు ఫోన్చేసి విషయం చెప్పినట్లు సమాచారం. దీంతో రంగంలోకి దిగిన సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సికింద్రాబాద్బీఆర్ఎస్అభ్యర్థులుగా ఆ పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, నగేశ్ముదిరాజ్ కు ఆఫర్ఇచ్చినట్లు తెలిసింది. అయితే దాసోజు శ్రవణ్ ఒకవేళ ఎన్నికలు వస్తే ఖైరతాబాద్అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని చెప్పినట్లు సమాచారం.
దీంతో నగేశ్ముదిరాజ్కు లైన్క్లియర్అయింది. కాంగ్రెస్అభ్యర్థి దానం నాగేందర్ పై బీసీ లీడర్ని బరిలో నిలపడమే కరెక్ట్అని బీఆర్ఎస్హైకమాండ్యోచిస్తోంది. గత లోకసభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి బీఆర్ఎస్అభ్యర్థిగా సనత్నగర్ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్కొడుకు సాయికిరణ్యాదవ్పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి కూడా సాయికిరణ్బరిలో ఉంటారని అందరూ భావించారు. అయితే కొడుకుకు బదులుగా తలసాని శ్రీనివాస్యాదవ్నే పోటీ చేయాలని కేసీఆర్కోరారు.
అందుకు తలసాని ససేమిరా అన్నారు. ఎంత చెప్పినా తన ఆలోచన మార్చుకోకపోవడంతో గులాబీ బాస్ దృష్టి ఎమ్మెల్యే పద్మారావుగౌడ్పై పడింది. అయితే పద్మారావుగౌడ్తన కొడుకుకు టికెట్ ఇవ్వాలని కోరారు. కానీ కేసీఆర్పద్మారావునే ఎన్నికల్లో తలపడమని చెప్పడంతో ఆయన కొంత తటపటాయించారు. ఈలోగా పద్మారావుగౌడ్ సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారంటూ సోషల్మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పలువురు బీఆర్ఎస్నేతలు ఆయన్ని కలిసి శాలువాలు కప్పి, సన్మానాలు చేశారు. తాజాగా నగేశ్ముదిరాజ్పేరు తెరపైకి వచ్చింది.