అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు : వినోద్‌‌కుమార్‌‌‌‌

అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు : వినోద్‌‌కుమార్‌‌‌‌

హుస్నాబాద్​, వెలుగు: కాంగ్రెస్‌‌ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, కేంద్రంలోని బీజేపీ ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తోందని బీఆర్ఎస్‌‌ కరీంనగర్‌‌‌‌ ఎంపీ అభ్యర్థి బి.వినోద్‌‌కుమార్‌‌‌‌ ఆరోపించారు. ఆ రెండు పార్టీలనూ ప్రజలు నమ్మడంలేదని, కరీంనగర్​ ఎంపీగా తననే గెలిపిస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్​కుమార్​తో కలిసి మార్నింగ్​వాక్​ చేశారు. 

ఎల్లమ్మచెరువుకట్ట, అంబేద్కర్​ చౌరస్తా, గాంధీ చౌరస్తా, మల్లెచెట్టు చౌరస్తా, కూరగాయలమార్కెట్‌‌లో ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నెహ్రూ, ఇందిరమ్మ తెచ్చిన పథకాలను తామే తెచ్చామని బీజేపీ అభ్యర్థి బండి సంజయ్​ ప్రచారం చేసుకుంటున్నాడన్నారు. కాంగ్రెస్సేమో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా మోసం చేస్తోందన్నారు. ఐదేండ్లుగా ఎంపీ బండి సంజయ్​ హుస్నాబాద్​ నియోజకవర్గానికి ఐదు రూపాయల పని చేయలేదన్నారు. కరీంనగర్​ఎంపీగా తనను గెలిపిస్తే పార్లమెంట్​ నియోజకవర్గ ప్రజలకు తాను 24 గంటలు అందుబాటులో ఉంటానన్నారు.