రైతుపై దాడి...బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకుపై కేసు

రైతుపై దాడి...బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకుపై కేసు

 
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కాసిపేటలో దారుణం జరిగింది. కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న అక్రమాలపై ప్రశ్నించిన రైతుపై దాడి చేశాడు బీఆర్ఎస్ నేత, వార్డు మెంబర్. రైతు ముత్తయ్య తన ధాన్యాన్ని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాడు. తూకంలో తరుగు పేరుతో మూడు బస్తాల్లో కోత విధించాడు స్థానిక బీఆర్ఎస్ లీడర్ రాజేశ్. 

కొనుగోలు కేంద్రంలో జరిగిన దోపిడిని BRS ఎమ్మెల్యే దివాకర్ రావు కొడుకు విజిత్ రావుకు చెప్పేందుకు ప్రయత్నించాడు రైతు ముత్తయ్య. దీంతో ఆగ్రహించిన బీఆర్ఎస్ వార్డు మెంబర్ రాజేశ్ విజిత్ రావు ముందే రైతుపై దాడి చేశాడు. విచక్షణ రహితంగా కొట్టడంతో సృహ తప్పి పడిపోయాడు రైతు ముత్తయ్య. బాధితుడిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. తమ బాధలు చెప్పుకునేందు వెళ్తే దాడులు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు కుటుంబసభ్యులు. కళ్ల ముందే దాడి చేస్తున్నా ఎమ్మెల్యే కొడుకు పట్టించుకోకుండా వెళ్లడం దారుణమన్నారు. 

దండెపల్లి పోలీస్ స్టేషన్ లో రైతుపై దాడి చేసిన బీఆర్ఎస్ లీడర్ రాజేశ్ పై, దాడి చేస్తున్నా చూస్తూ పట్టించుకోని ఎమ్మెల్యే దివాకర్ కొడుకు విజిత్ రావుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది రైతు ముత్తయ్య భార్య భాగ్యలక్ష్మి.