కేసీఆర్​ ఫాం హౌస్​ను ముట్టుకుంటే ఊరుకోం : గెల్లు శ్రీనివాస్

కేసీఆర్​ ఫాం హౌస్​ను ముట్టుకుంటే ఊరుకోం :  గెల్లు శ్రీనివాస్

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్​ఫాం హౌస్​పై దాడులు చేస్తామన్న కాంగ్రెస్​నేత . సోమవారం తెలంగాణ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఫాం హౌస్​ను ముట్టుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కాంగ్రెస్​అధికారంలోకి వచ్చేందుకు ప్రజలకు 420 హామీలను ఇచ్చిందని, ఆ హామీలను అమలు చేయకుండా రోజు బీఆర్ఎస్​పై ఆరోపణలతో కాలం వెళ్లదీస్తుందని విమర్శించారు.

పాలనపై దృష్టిపెట్టకుంటే ఎన్నికల్లో ప్రజలు కర్రుకాల్చి వాత పెడతారని మండిపడ్డారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకుడు తుంగ బాలు తదితరులు పాల్గొన్నారు.